Telugu

ది కాకినాడ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెంబర్ 8979., కాకినాడ గురించి క్లుప్తంగా:-

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో 1923 అక్టోబర్ 12న రిజిస్టర్ కాబడిన ది కాకినాడ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, కాకినాడలో ప్రారంభించి బడుగు, బలహీనవర్గాలకు, మధ్యతరగతి ఉన్నత వర్గాలకు గృహ అవసరాలు తీర్చి గ్రామీణ గృహ అభివృద్ధి ఉద్దేశ్యంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించడం జరిగినది. గృహ నిర్మాణానికి ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తూ ఉండేది. భారతదేశ స్వాతంత్రఅనంతరం అప్పటి కలెక్టర్, పట్టణ ప్రముఖులైన శ్రీ కొమ్మి రెడ్డి సూర్యనారాయణ మూర్తి గారిని ఈ సంస్థ కార్యకలాపాల పర్యవేక్షకునిగా నియమించినారు.

1950వ సంవత్సరం రిపబ్లిక్ అనంతరం మొట్టమొదటి సారిగా ఎన్ని కలు జరిగి శ్రీ కోసూరి కృష్ణారావు గారు తొలి సంఘ అధ్యక్షునిగా ఎన్ని కైనారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్న సహకార విధానాలని అనుసరిస్తూ, పట్టణ గ్రామీణ గృహ నిర్మా ణ అవసరాలకు ప్రభుత్వ నిధుల నుండి రుణములు మంజూరు చేయడం జరిగేది. 1964లో భారత ప్రభుత్వ సహకార చట్టం అమల్లోకి వచ్చి న తర్వా త ఆ చట్టం పరిధిలో నమోదు కాబడి ఇప్పటికీ అదే చట్టపరిధిలో ఈ సంఘ కార్యకలాపములు నిర్వహించుట జరుగుచున్నది.

1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గృహ నిర్మా ణ సంఘాల సమాఖ్య (ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్) రాష్ట్ర ములో ప్రాథమిక గృహనిర్మా ణ సంఘములకుమూకుమ్మడిగా నిధులు సేకరించి మంజూరు చేసే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినది. ఈ సమాఖ్య ఏర్పడుటలో కీర్తిశేషులు శ్రీ కోసూరి కృష్ణారావు గారి పాత్రవిశిష్టమైనది. ఈయన హౌస్ ఫెడ్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరించడం కూడా జరిగినది. ఈ సమాఖ్య ఎల్ఐసి వారి నుండి హెచ్చు మొత్తంలో రుణములు సేకరించి ప్రాథమిక సహకార సంఘాలకు 1% మార్జిన్తో సంఘ సభ్యులకు ఎల్ఐజి, ఎంఐజి మరియు హెచ్ఐజి అను మూడు వర్గాలు వారికి రుణములు మంజూరు చేసేది. ఈ సమాఖ్య కు ది కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనుసంధానమై కాకినాడ పట్టణ మరియు చుట్టుప్రక్కల 63 గ్రామాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తూ 1985 నాటికి లావాదేవీలు నాలుగు కోట్లుకు చేరుకుని రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా పేరుపొందినది. అయితే 1985 సంవత్సరం అనంతరం ఎల్ఐసి మరియు బ్యాంకులు గృహ నిర్మా ణమునకు నేరుగా రుణములు మంజూరు చేయుట ప్రారంభించినారు . ఏకఛత్రాధిపత్యంగా విరాజిల్లుతున్న సహకార ఉద్యమానికి గట్టి పోటీ ఏర్పడినది. మూడు అంచెలుగా రుణాలు మంజూరు చేసే ఈ సహకార వ్యవస్థ ఒకేసారి, ఒకే కార్యాలయం నందు రుణములు మంజూరు చేసే ఎల్ఐసి మరియు బ్యాంకుల ధాటికి నిలువలేక రాష్ట్ర వ్యాప్తంగా సహకార గృహనిర్మా ణ సంస ్థలన్నీ నీరు గారి నత్తనడక అవలంబించడం మొదలైనది. పెరుగుతున్న ఖర్చు లు తరుగుతున్న వ్యాపారము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సహకార ఉద్యమాన్ని మట్టుపెట్టే వాతావరణం కమ్ముకుంది.
అటువంటి తరుణంలో సంస్థ అధ్యక్షులు శ్రీ కోసూరి కృష్ణారావు గారు మే నెల 1995వ సంవత్సరములో హఠాత్తుగా మరణించుట సంస్థను దిగ్భ్రా ంతి కి గురిచేసింది .
ఈ తరుణంలో ఆయన కుమారులు శ్రీ కోసూరి యదు సూర్య గారు అధ్యక్షుడిగా కోఆప్ట కాబడి బాధ్యతలు స్వీ కరించి సంఘ ఆర్థిక, వ్యవస్థాగత రాజకీయ పరిస్థితులను గమనించి ఆయన సభ్యుల నుండి డిపాజిట్స సేకరించి స్వయంగా గృహ నిర్మాణానికి, మరమ్మత్తులకు, కొనుగోళ్లకు, అపార్ట్మెంట్లు నిర్మాణానికి మరియు అభివృద్ధికి రుణములు మంజూరు చేసినచో ఆర్థిక పటిష్టతను, స్వయంప్రతిపత్తిని సాధించగలమని అప్పటి “బోర్డఆఫ్ డైరెక్టర్స” యొక్క అంగీకారంతో సంఘములో దానికి అనుగుణంగా భైలాలలో మార్పు లు చేసి 1996వ సంవత్సరం జనవరి నుండి నూతన శఖానికి శంఖారావం పూరించినారు. అదే విధంగా రిటైర్డ మరియు పెన్షనర్స లో పొదుపు ప్రోత్సహించాలనే సామాజిక స్ప ృహతో ఈ సంఘ కార్యకలాపాలు కొనసాగించుచున్నది. సంఘ అభివృద్ధి కొరకు అచ్చంపేటలోనూ కొప్పవరం లోను వెంచర్లు చేసి సభ్యులకు అందజేయడం జరిగినది. కేవలం ఆర్థిక పరిస్థితే
ధ్యేయంగా కాక సామాజిక స్ప ృహతో ఈ సంఘ సభ్యుల మధ్య మరియు పట్టణ ప్రజల మధ్య సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి వారి యొక్క విశ్వాసాన్ని చవిచూచి సంఘము దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 90 కోట్ల రూపాయలు డిపాజిట్లు కలిగి సుమారు 73 కోట్ల రూపాయిలు గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేసి అగ్రగామిగా నిలదొక్కు కుంటున్న తరుణంలో ఏప్రిల్ 2011లో “ట్రెండ్ సెట్టర్” శ్రీ కోసూరి యదుసూర్య గారు ఆకస్మిక మరణం సంఘమునకు అశనిపాతం లాంటిది. 

స్వర్గీయ శ్రీ కోసూరి యదు సూర్య గారి మరణానంతరం వారి కుమార్తె అధ్యక్షురాలుగా శ్రీమతి కోసూరి చిలక వీర రాఘవి గారు సంఘ పటిష్టతను చేకూర్చే విధంగా సభ్యుల అవసరాలు ఎప్పటికప్పు డు తెలుసుకొని దానికి అనుగుణంగా సంస్థ ను తీర్చి దిద్దుట జరిపినారు. వీరి పదవి కాలంలో డిపాజిట్లను 250 కోట్లకు పెంచుటలోనూ రుణములను 195 కోట్లకు పెంపొందింపజేయటలోను కృషి సలిపినారు అనుటలో అతిశయోక్తి లేదు.

తదుపరి 2016 మరియు 2021 సంవత్సరములలో సంఘానికి జరిగిన ఎలక్షన్లలో శ్రీ కోసూరి శ్రీనివాస సత్యనారాయణమూర్తి గారు సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్ని క కాబడినారు అని తెలియజేయుటకు ఎంతగానో సంతోషించుచున్నాము. దివి 31-3-2022 నాటికి సంఘ డిపాజిట్లను సుమారు 377 కోట్లకు, షేరు ధనము సుమారు 12 కోట్లు, ఋణములు సుమారు 229 కోట్లకు, ఫిక్స డ్ ఎసెట్స సుమారు 78 కోట్లు, అత్యవసర సమయములో వాడుకొనుటకు వీలుగా వివిధ భ్యాంకులలో డిపాజిట్లు రూపంలో సుమారు 66 కోట్లు, కరెంటు అస్సె ట్స రూపంలో సుమారు 90 కోట్లు కలిగి ఉండి మొత్తం మీద సుమారు 400 కోట్ల వర్కి ంగ్ క్యా పిటల్ రూపంలో  ఏర్పా ట్లు గావించుటలో వీరి కృషి అనన్య సామాన్యమైనది. 2021 22 సంవత్సరమునకు గాను విడుదల కాబడిన ఆడిట్ రిపోర్ట ప్రకారం సుమారు రెండున్నర కోట్ల నికర లాభం సంఘం అర్జించినది అని విన్నవించుకొనుచు గడిచిన 20 సంవత్సరాలుగా కూడా సంఘం లాభాల దిశలో పయనించుచూ సభ్యులకు డివిడెండ్లు పంపిణీ చేయుట జరుగుతున్నది.

సంఘం సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంఘ సొంతభవనములో 31-3-2015 తేదీన జిల్లాలో సహకార వ్యవస ్థకే తలమానికంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారిని శ్రీమతి T. ప్రవీణ గారి అమృత హస్తాలతో ఏటీఎం ను సొంతంగా నెలకొల్పడం జరిగింది. సత్వరం సభ్యుల సేవలు నిర్వర్తించుటకు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ జరుపబడినది అని తెలియజేయుచున్నాము.

సహకార వారోత్సవాల్లో భాగంగా స్కూలు విద్యార్థిని, విద్యార్థులకు డ్రాయింగ్, వక్తృత్వపు మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం గావించుట, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనూ మరియు మహర్షి బులుసు సాంబమూర్తి పాఠశాలలోని అనాధ బాల బాలికలకు పుస్తకాల పంపిణీ, శీతోష్ణస్థితిని తట్టుకోనుటకు గాను దుప్పట్లు పంపిణీ మరియు Helpage వంటి సంస ్థలకు ఆర్థిక సహాయము మరియు వృద్ధాశ్రమంలోని వారికి చేయూతగా నిత్యవసర వస్తువుల పంపిణీ మరియుAir Cooler, Gas Stove వంటి
పరికరాలను పంపిణీచేయుట, కరోనాకాలంలో అనగా 2021 మరియు 2022 సంవత్సరములు మినహాయించి అన్ని సంవత్సరములలో సంఘ ప్రధాన కార్యాలయంలో “రోటరీ క్లబ్” వారి సౌజన్యంతో రక్తదాన శిబిరములు నిర్వహించుట మరియు కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో సభ్యులకు ఉచిత నేత్రవైద్య శిబిరం మరియు ట్రస్ట హాస్పి టల్ వారి సహృదయతతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుట 2013లో “ఉత్తరాఖండ్”లో సంభవించిన వరద ప్రభావాలకు జనజీవనం అతలాకుతలమైన సందర్భా న్ని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి “రిలీఫ్ ఫండ్” గా ఆర్థిక సహాయం చేయుట మరియు 2014లో సంవత్సరంలో విశాఖ జిల్లాకు సంభవించిన హుద్ హుద్ తుఫానుకు విలవిలలాడిన ప్రజానీకానికి బాసటగా ముఖ్యమంత్రి సహాయనిధికి అప్పటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి చేతుల మీదుగా సంఘ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, సూపర్వై జర్ కౌన్సి ల్ సభ్యులు, సంఘ సిబ్బంది నుండి వసూలు చేసిన మొత్తానికి సంఘ సాముదాయిక నిధులునుండి కొంత మొత్తం జోడించి సుమారు రూ. 2,22,222/- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు ను ప్రధానం చేయుట జరిగినది ఇటువంటి కార్యక్రమాలను సహకార సూత్రాల్లో పొందుపరిచిన విధంగా “సమాజ శ్రేయస్సు” Concern for Community దృష్ట్యా నిర్వర్తించడం జరుగుతున్నదని విన్నవించుకొనుచున్నాము.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ నుండి రెండు ధపాలు ఉత్తమ సొసైటీగా అవార్డు పొందిన సంస ్థమరియు ఉమ్మడి రాష్ట్ర ంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్యూనియన్ నుండి గృహ నిర్మా ణ సంఘాల్లో ఉత్తమ సంఘముగా ఎంపిక కాబడినది మరియు “ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్”, న్యూఢిల్లీ నుండి సహకార సంఘాల్లో “ఎక్స లెన్స” అవార్డు పొందిన సంస్థ అని విన్నవించుకుంటున్నాము.

సభ్యులు అవసరాలకు అనుగుణంగా సంఘాన్ని అభివృద్ధి పధంలో నడిపించుటలో సంఘ అధ్యక్షులు శ్రీ కోసూరి శ్రీనివాస సత్యనారాయణ మూర్తి గారు మిగిలిన పాలకవర్గ సభ్యులతోనూ, సూపర్వై జర్ కౌన్సి ల్ సభ్యులతోనూ, అధికార, అనధికారులతోనూ సంఘ సిబ్బందితో మమేకమై చక్కని సమన్వయంతో కాలానుగుణంగా సత్వర నిర్ణయాలు అమలు చేయుచు రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ చరిత్రలోనే సహకార గృహ నిర్మా ణ సంఘాలకే తలమానికంగా తీర్చి దిద్దుతూ ప్రధాన కార్యాలయం మూడు అంతస్తులు సొంతభవనంలో
కార్యక్రమాలు సాగించుచుండగా సర్పవరం మరియు అన్నమ్మ గాటి సెంటర్లలో రెండు బ్రాంచ్ కార్యాలయములు ద్వారా ఇరు ప్రాంతాలలో ఉండే సభ్యులకు అనువుగా నెలకొల్పి నోట్ల రద్దు సమయంలో గాని, కోవిడ్-19 కాలంలో గాని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధీటుగా ఎదుర్కొనుచు మరియు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా నడిపించుటలో ఎంతయోకృషి జరుపుతున్నా రు అని సవినయంగా విన్నవించుకొనుచున్నాము.

సంస్థ ఏర్పా టు చేసి 100వ సంవత్సరంలో అడుగిడుతున్న ఈ శుభసందర్భంలో మీ అందరి ఆదరాభిమానములే సంఘ పురోభివృధికి మైలురాయిగా భావిస్తూ ఇదే స్పూర్తితో సభ్యులు అందరు  “సంఘంమనది” అనే ద్యేయంతో వ్యవహరించుచూ సంఘాన్ని మరింతగా ముందుకు నడిపించుటకు మీ వంతు సహాయ సహకారములే మాకు శ్రీ రామరక్షఅని విన్నవించుకొనుచూ భావితరాలవారుకూడా దీని ఫలాలను అనుభవించే రీతిలో కృషిసలుపుటలో మీ వంతు కృషిని వినయపూర్వకంగా అభ్యర్దించుచూ, భారత ప్రభుత్వం స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన ఈ వజ్రోత్స “ఆజాదీకా అమృత్ మహోత్సవ ” గా జరుపుకుంటున్న ఈ తరుణంలో సంఘము శతవసంతాల శతాబ్ది వేడుకలు జరుపుకొనుటలో ఎందరో మహానుభావులు అందరికి వందనాలు తెలియచేయుచూ ప్రముఖంగా స్వర్గీయ శ్రీ కోసూరి కృష్ణారావు గారు మరియు శ్రీ కోసూరి యదు సూర్య గార్లు తుది శ్వా స విడిచేవరకు ఆహర్ని శలు సంఘ పురోభివృద్దే ద్యేయంగా పనిచేసినవారి మాట, బాట మరియు వారి నిర్ధేశించిన దశదిశ నిర్ధేశ్యమే లక్ష్య ంగా పనిచేయుట ముదావహము అని తెలియచేసుకుంటున్నాము.

ఈ సందర్భంగా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎంతో కాలంగా డిపాజిట్లు కొనసాగిస్తూ మరియు సంస ్థనుండి తీసుకున్న రుణములను సక్రమంగా చెల్లిస్తూ మన సొసైటీ యొక్క కార్యకలాపాలలోముఖ్యపాత్రపోషిస్తున్నా సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేయుచున్నాము.

Comments are closed.